Annamalai: మణిపూర్‌ అంతా ప్రశాంతంగానే ఉందిగా..

ABN , First Publish Date - 2023-07-30T08:45:38+05:30 IST

మణిపూర్‌లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.

Annamalai: మణిపూర్‌ అంతా ప్రశాంతంగానే ఉందిగా..

పెరంబూర్(చెన్నై): మణిపూర్‌లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు. రామేశ్వరం(Rameswaram) నుంచి అన్నామలై చేపట్టిన ‘ఎన్‌ మన్‌ ఎన్‌ మక్కల్‌’ పాదయాత్రను శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రారంభించించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శనివారం ఏర్కాడు ప్రాంతంలో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... 2001-14 వరకు 85 మంది రాష్ట్ర జాలర్లు తుపాకి కాల్పుల్లో మరణించారని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర జాలర్లపై తుపాకి కాల్పులు లేకపోగా, అరెస్ట్‌లు కూడా తగ్గాయన్నారు. కచ్ఛాదీవు, నెడు దీవు సమస్యలకు పరిష్కారం లభించేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎన్‌ఎల్‌సీ విస్తరణకు నిషేధం విధిస్తే పలువురు ఉద్యోగాలలు కోల్పోయే అవకాశముందన్నారు. 16 వేల మంది తమిళ కార్మికుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. చట్టప్రకారం ఎన్‌ఎల్‌సీ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.

Updated Date - 2023-07-30T09:00:22+05:30 IST