Delhi Liquor Scam Case: మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు.. ఎప్పుడంటే

ABN , First Publish Date - 2023-03-20T21:29:32+05:30 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha)ను మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు.

Delhi Liquor Scam Case: మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు.. ఎప్పుడంటే
BRS MLC Kavitha ED

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు. కవితను మంగళవారం ( మార్చి 21) ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రావాలని నోటీసుల్లో సూచించారు.

ఇవాళ ఆమెను ఈడీ అధికారులు దాదాపు పదిన్నర గంటలకు పైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది.

ఉదయం కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.

సాయంత్రం సమయంలో కవితను ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ప్రశ్నించారు.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.

కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపించారు.

కవిత ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 24న విచారణకు రానుంది.

Updated Date - 2023-03-20T22:05:28+05:30 IST