Share News

Hemant Soren: ఆరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2023-12-11T10:52:56+05:30 IST

రాంచీలో భూముల క్రయవిక్రయాలు, కొనుగోలు మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు ​​పంపింది.

Hemant Soren: ఆరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు

రాంచీలో భూముల క్రయవిక్రయాలు, కొనుగోలు మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి, ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు ​​పంపింది. దీంతో హేమంత్ సోరెన్‌ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. "ముఖ్యమంత్రి మంగళవారం రాంచీలోని ఏజెన్సీ జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది" అని ఒక అధికారి తెలిపారు. గతంలో ఇదే కేసు విషయంలో ఆయనకు ఈడీ ఐదోసారి నోటీసులు పంపించింది. ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ సోరెన్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో మొదట ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. కాగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా సోరెన్ ఉన్నారు. ఇక తాజాగా ఈడీ ఇచ్చిన నోటీసులను హేమంత్ సోరెన్ ఇంకా సవాలు చేయలేదు.

Updated Date - 2023-12-11T10:52:57+05:30 IST