Karnataka Election: బీజేపీకి రికార్డ్ మెజారిటీ...ప్రధాని మోదీ జోస్యం

ABN , First Publish Date - 2023-04-27T11:12:05+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజారిటీ సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం...

Karnataka Election: బీజేపీకి రికార్డ్ మెజారిటీ...ప్రధాని మోదీ జోస్యం
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజారిటీ సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.(Prime Minister Narendra Modi) ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కర్ణాటక రాష్ట్రంలోని 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా సంభాషించారు.తాను త్వరలో కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తానని మోదీ చెప్పారు.‘‘ కర్ణాటక రాష్ట్ర ప్రజల మన్ననలు పొందేందుకు ఒకటిరెండు రోజుల్లో నేను కర్ణాటకలో పర్యటిస్తాను.. రాష్ట్రంలో ప్రచారం చేసిన బీజేపీ నేతలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కర్ణాటక ప్రజలకు బీజేపీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంగళూరు నగరంలో జరగనున్న ర్యాలీలో ప్రసంగించనున్నారు.

Updated Date - 2023-04-27T11:12:05+05:30 IST