Home » Twitter
టీడీపీ అధినేత చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతుంటారని మోదీ కొనియాడారు.
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(X) భారత్లోని 2 లక్షల మందికి పైగా యూజర్ల అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.
సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో శనివారం నుంచి "క్లిక్ హియర్"(Click Here) అనే ట్రెండ్ నడుస్తోంది. ఎక్స్ ప్లాట్ఫాంని మీరూ వాడుతున్నట్లైతే క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఫొటోలు మీకు కనిపించే ఉంటాయి. ఇందులో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్లో తాజా పరిణామాలపై ‘ఎక్స్’ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కొనియాడారు.
గతంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి Xగా మార్చి అనేక మార్పులు చేశారు. ఈ క్రమంలోనే అర్హతగల సృష్టికర్తల కోసం 'యాడ్ రెవెన్యూ షేరింగ్' ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 150,000 కంటే ఎక్కువ మంది క్రియేటర్లకు 45 మిలియన్ డాలర్ల కంటే(రూ.3,73,54,50,000) ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు ఇటివల ప్రకటించారు.
KTR Remembers Chandrababu: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్.
Telangana: తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ ‘‘మీ మెదడుకు పదను పెట్టండి’’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. మస్క్పై నలుగురు వ్యక్తులు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టులో దావా వేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ఇటివల రైతుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్పై ఆంక్షలు మొదలయ్యాయి. రైతుల నిరసనలకు సంబంధం ఉన్న నిర్దిష్ట ఖాతాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం X (గతంలో ట్విట్టర్)కు ఆదేశాలు జారీ చేసింది.