TS DSC: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2023-08-25T16:51:57+05:30 IST

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (TS DSC) రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

TS DSC: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (TS DSC) రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంతోకాలంగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్‌న్యూసే.

ఇదిలా ఉంటే డీఎస్సీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసినా అసెంబ్లీ ఎన్నికల లోపు టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి కావటం సందేహమే. రెండు, మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు సెప్టెంబరు 15న టెట్‌ను నిర్వహించి, వాటి ఫలితాలను అదే నెల 27న ప్రకటించనున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాతనే అభ్యర్థుల నుంచి డీఎస్సీకి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత కనీసం రెండు నెలల అనంతరమే డీఎస్సీ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే డిసెంబరులోపు డీఎస్సీ నిర్వహించటం వీలుకాకపోవచ్చు. ఒక వేళ డిసెంబరులో జరపాలని భావించినా... అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సాధ్యం కాదు. అసెంబ్లీ ఎన్నికలు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి, వచ్చే ఏడాది జనవరి తర్వాతనే డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత వాటి ఫలితాలు, అభ్యర్థుల ఎంపిక వంటి ప్రక్రియ ముగిసి పోస్టుల భర్తీ పూర్తి కావటానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల వరకు సమయం పట్టవచ్చు.

Updated Date - 2023-08-25T16:53:28+05:30 IST