Boragam Srinivasulu: ఎమ్మెల్సీగా గెలిచిన పంచుమర్తి అనురాధకు శుభాకాంక్షలు తెలిపిన బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2023-03-24T19:21:02+05:30 IST

మ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthy Anuradha) విజయం సాధించడంపై పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) హర్షం వ్యక్తం చేశారు.

Boragam Srinivasulu: ఎమ్మెల్సీగా గెలిచిన పంచుమర్తి అనురాధకు శుభాకాంక్షలు తెలిపిన బొరగం శ్రీనివాసులు

ఏలూరు జిల్లా: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthy Anuradha) విజయం సాధించడంపై పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుట్టాయగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి పంచుమర్తి అనురాధకు పోలవరం నియోజకవర్గం టీడీపీ తరుపున బొరగం శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగారిక, కుందుల శ్రీను, మాటురి ముసలయ్య, చిలకమూడి సుధాకర్, పసుమర్తి భీమేశ్వరరావు, గన్నిన సూర్యచంద్రరావు, కుర్సం దుర్గారావు, మందపాటి మోజేష్, సుంకర వెంకట్రావు, పఠాన్ రసూల్ ఖాన్, కూరం సూర్యచంద్రుడు, ఆండ్రు శ్యామ్ కుమార్, కుర్సం నవీన్, కుర్సం రవి, కారం సురేష్, కుంజం శ్రీను, పెద్దబాబు రెడ్డి, కుంజం బుచ్చిబాబు, అడవి రాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-24T19:21:15+05:30 IST