Boragam Srinivas: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు జగన్‌కి చెంపపెట్టు

ABN , First Publish Date - 2023-03-18T18:11:06+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) తెలుగుదేశం (TDP) ఘన విజయం సాధించడం వైసీపీ (YCP) కి, జగన్ రెడ్డికి (CM JAGAN) చెంపపెట్టు అని టీడీపీ పోలవరం

Boragam Srinivas: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు జగన్‌కి చెంపపెట్టు
టీడీపీ గెలుపు

ఏలూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) తెలుగుదేశం (TDP) ఘన విజయం సాధించడం వైసీపీ (YCP) కి, జగన్ రెడ్డికి (CM JAGAN) చెంపపెట్టు అని టీడీపీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivas) వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం అసమర్థ పాలకుడు జగన్ రెడ్డికి చెంపపెట్టు. పట్టుభద్రులు ప్రజాస్వామ్య పరిరక్షణకై నడుం బిగించి ఇచ్చిన ఫలితం. రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ దమనకాండ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇది. 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, చంద్రబాబు పాలన కోరుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం ప్రధాన లక్ష్యం అని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాల పరిశీలకునిగా పనిచేయటం, విజయంలో భాగస్వామి అవటం సంతోషంగా ఉంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

dddddd.jpg

Updated Date - 2023-03-18T18:12:50+05:30 IST