Share News

Yuvagalam: యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 19 , 2023 | 04:17 PM

ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

 Yuvagalam: యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

విజయనగరం: ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ నలుమూలల నుంచి విశాఖపట్నం విజయనగరం టీడీపీ నేతలు, శ్రేణులు వచ్చారు. యువగళం ముగింపు సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా టీడీపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షలకు పైగా సభకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి విజయనగరానికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 04:17 PM