Vangalapudi Anitha: ‘జబర్దస్త్ మేడం.. వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో’

ABN , First Publish Date - 2023-03-27T14:05:12+05:30 IST

రాష్ట్ర మంత్రులపై టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Vangalapudi Anitha: ‘జబర్దస్త్ మేడం.. వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో’

విశాఖపట్నం: రాష్ట్ర మంత్రులపై టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (TDP Leader Vangalapudi Anitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్క్ష్యలపై అనిత మాట్లాడుతూ... ‘‘మా దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నావ్.. ఇప్పుడు అదే మీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీని గెలిచాం.. ఇది దేవుని స్క్రిప్ట్’’ అని అన్నారు. ఉండవల్లి శ్రీదేవి... ఊసరవెల్లి శ్రీదేవి అని జోకర్ మంత్రి అంటున్నారని.. తమకన్నా పెద్ద నటులు ఎవరు లేరని వ్యాఖ్యలు చేశారు. పేకాట క్లబ్బులు నడిపిన రాపాక రూ.10 కోట్ల కోసం మాట్లాడుతున్నావు.. అసలు నీకు 10 వేలు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. జబర్దస్త్ మేడం.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో అని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వైసీపీ... రఘురామరాజును ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని ప్రశ్నించారు. తమరు చేసిన పనుల వలన ప్రజావ్యతిరేకత వచ్చిందని అనిత పేర్కొన్నారు.

అనిత ఇంకా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) అన్నపూర్ణగా పిలిచేవారని.. ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా చెప్పుకుంటున్నారని అన్నారు. సైకో సీఎం జగన్ (CM Jagan Reddy) సీట్‌లో కూర్చున్న తర్వాత... ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, హత్య, అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. 2019కు ముందు... గంజాయి పట్టుకున్నవారిని మీడియా ముందు చూపించేవారన్నారు. ఆర్ధిక సంవత్సరంలో 2. 6 లక్షల కేజీలు పట్టుకున్నరంటే... గంజాయి ఎంత విచ్చల విడిగా రవాణా జరుగుతుందో అర్థమవుతోందని తెలిపారు. గంజాయి సాగును వైసీపీ రాష్ట్ర పంటగా ప్రకటించారని అనుమానం వస్తోందని వ్యాఖ్యలు చేశారు. స్కూల్, కాలేజ్, స్కూల్ చదువుతున్న అమ్మాయిల చేతుల్లో గంజాయి దొరుకుతుందన్నారు. చివరికి పవిత్రమైన తిరుమలలో కూడా గంజాయి దొరుకుతున్న దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉందని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు మద్దతుతో వచ్చిన ఉద్యోగులు మద్యం తాగుతూ దొరికారన్నారు.

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అడిగారా? అని ప్రశ్నించారు. క్రిమినల్ రికార్డ్స్‌లో నేరాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్‌1గా ఉందన్నారు. పవిత్రమైన తిరుపతిలో కూడా గంజాయి, మద్యం దొరుకుతుందనే జగన్‌ను ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పాలని అన్నారు. గంజాయి మత్తులో యువత హత్యలకు పాల్పడుతున్నారని చెప్తుంటే.. కనీసం రివ్యూ కూడా నిర్వహించాలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్‌లో యువతకు ఉద్యోగాలు అని చెప్తుంటే సిగ్గు వెయ్య లేదా? అని నిలదీశారు. మధ్యనిషేదం అని చెప్పి... ఇప్పుడు మద్యం నుంచి వచ్చిన సొమ్ములుతోనే ప్రభుత్వం నడుపుతున్నామని చెప్పడానికి సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యల కోసం మాట్లాడితే.. తమపై పేటీఎం కుక్కలను పంపిస్తారని అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-27T14:05:12+05:30 IST