TDP VS Roja: మంత్రి రోజా చిత్రపటం వద్ద తెలుగు మహిళల కన్నీరు.. కారణమేంటంటే..?

ABN , First Publish Date - 2023-09-20T21:08:08+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌(Chandrababu Naidu illegally arrested)పై పలు పార్టీలు ఖండిస్తున్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అరెస్ట్‌ను ముక్తఖంఠంతో ఖండిస్తున్నారు.

TDP VS Roja: మంత్రి రోజా చిత్రపటం వద్ద తెలుగు మహిళల కన్నీరు.. కారణమేంటంటే..?

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌(Chandrababu Naidu illegally arrested)పై పలు పార్టీలు ఖండిస్తున్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అరెస్ట్‌ను ముక్తఖంఠంతో ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నాయకులు వివిధ పద్ధతుల్లో రోజుకోక విధంగా ఆందోళనలు చేపడుతున్నారు. బుధవారం నాడు తెలుగు మహిళలు విన్నూత రీతిలో నిరసనలు తెలిపారు. వైసీపీ మంత్రి ఆర్కే రోజా(YSP Minister Roja) చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల పట్ల పలు సందర్భాలల్లో అసభ్యకరంగా మాట్లాడుతుండంతో తెలుగు మహిళ నేతలు ఒక అడుగు ముందుకు వేసి రోజా పట్ల నిరసన తెలిపారు.

రోజా పట్ల తెలుగు మహిళల వినూత్నంగా నిరసన..

తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు రోజా చిత్ర పటం ముందు తెలుగు మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. రోజా చిత్ర పటానికి పూలమాలలు వేసి కొబ్బరి కాయకొట్టి శ్రద్ధాంజలి ఘటించారు.చంద్రబాబు అక్రమ అరెస్టు వార్త విని గుండెపోటుతో రోజా చనిపోయిందని.. ఈ వార్త సోషల్ మీడియా ద్వారా తెలిసిందని మహిళలు పేర్కొన్కారు. ప్రసుత్తం టీడీపీలో లేకపోయినా... గతంలో తమ పార్టీకి సేవ చేసిందని.. ఆమె మరణ వార్త తట్టుకోలేకపోతున్నామని తెలుగు మహిళలు కన్నీరు పెట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు.

Updated Date - 2023-09-20T21:08:08+05:30 IST