Share News

AP NEWS: రుషికొండ విధ్వంసంపై విచారణ కోసం కమిటీని నియమించిన కేంద్రం

ABN , First Publish Date - 2023-11-29T16:12:08+05:30 IST

రుషికొండ ( Rushikonda ) లో జరిగిన విధ్వంసం, అక్రమాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) కమిటీని నియమించింది. నిపుణుడు గౌరప్పన్ ఆధ్వర్యంలో మొత్తం 5 గురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధిని నియమించింది.

AP NEWS: రుషికొండ విధ్వంసంపై విచారణ కోసం  కమిటీని నియమించిన కేంద్రం

విశాఖపట్నం: రుషికొండ ( Rushikonda ) లో జరిగిన విధ్వంసం, అక్రమాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) కమిటీని నియమించింది. నిపుణుడు గౌరప్పన్ ఆధ్వర్యంలో మొత్తం 5 గురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధిని నియమించింది. ఈ అధికారుల బృందం రుషికొండను సందర్శించి నష్టం అంచనా వేయాలని కేంద్రం ఆదేశించింది.. రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లి అంచనా వేయాలని ఆదేశించింది. కమిటీకి నెలకోజుల కాల పరిమితి విధించింది. హైకోర్ట్‌లో బుధవారం రుషికొండపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ ఉత్తర్వులను పేర్కొంది.

Updated Date - 2023-11-29T16:12:52+05:30 IST