Home » Rushikonda
రుషికొండ ప్యాలెస్ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్గా మారుస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది.
రిషికొండ ప్యాలెస్ను టూరిజం రిసార్ట్గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని మంత్రి పయ్యావుల తెలిపారు. రుషికొండ చివరి రెండు బ్లాక్లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు.
రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.
రుషికొండ టూరిజం రిసార్ట్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం వాడుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రిసార్టును మేజర్గా ఎలా వినియోగించాలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రుషికొండలో కంపెనీలు భూములు తీసుకుని భవనాలు నిర్మించినప్పటికీ, దశాబ్దంగా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. అదానీ డేటా సెంటర్ సహా అనేక ప్రాజెక్టులు కేవలం ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
పర్యాటక శాఖ మంత్రి దుల దుర్గేశ్ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ను ఎగురవేసి, అక్కడ పర్యాటక అభివృద్ధికి కొత్త చర్యలను ప్రకటించారు. బీచ్ అభివృద్ధి కోసం మౌలిక వసతులను పెంచి, స్థానికుల సహకారంతో బ్లూ ఫ్లాగ్ను నిరంతరం నిలుపుదామన్నారు
రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు బ్లూఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్ వెల్లడించారు.
దేశంలోనేరిషికొండ బీచ్ను నెంబ్ వన్గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.