Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం

ABN , First Publish Date - 2023-03-16T14:57:08+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం
వైసీపీ ఎంపీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ (ED) ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్‌ జైలులో ఉన్నారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎంపీ మాగుంటకు కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండే ఇదే స్కామ్‌లో గురువారం విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ అనారోగ్యం కారణాల చేత హాజరుకాలేనని తెలిపింది. దీంతో ఈనెల 20న హాజరుకావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.

MP.jpg

Updated Date - 2023-03-16T15:13:20+05:30 IST