Somireddy: ‘జగన్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడింది’

ABN , First Publish Date - 2023-02-18T14:46:21+05:30 IST

జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Somireddy: ‘జగన్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడింది’

నెల్లూరు: జగన్ రెడ్డి ప్రభుత్వాని (Jagan Reddy Government)కి పోయేకాలం దగ్గరపడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Leader Somireddy Chandramohan Reddy) విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగ్గంపేట, పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక అనపర్తి (Anaparthy)లో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ (Andhrapradesh) లో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోందని... ఇది చాలా దుర్మార్గమని మాజీ మంత్రి అన్నారు.

జగన్ రెడ్డి (Jagan Reddy), షర్మిల (YS Sharmila), విజయమ్మ (YS Vijayamma) పాదయాత్రలు చేసినా, కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఏనాడు అడ్డంకులు కల్పించలేదని గుర్తుచేశారు. రోడ్లపై అడ్డంగా నిలబడి పీకే రాసిచ్చిన పచ్చి అబద్ధాల సొల్లు చెబుతున్నా టీడీపీ హయాంలో పోలీసులు అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. నియంతపాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరపడిందన్నారు. సీనియర్ నాయకుడు చంద్రబాబు (TDP Chief) ను ప్రజలనుద్దేశించి మాట్లాడానివ్వరా... ఏపీలో ప్రజస్వామ్యం చచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-02-18T14:46:22+05:30 IST