Somireddy Chandramohan Reddy : సిలికా ద్వారా వైసీపీ నాయకులు కోట్లు గడిస్తున్నారు

ABN , First Publish Date - 2023-08-17T13:52:46+05:30 IST

సోమశిల నుంచి 21 టీఎంసీల నీరు దుర్వినియోగం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నీటి దుర్వినియోగంపై మంత్రులు నివేదిక వేసి విచారణ చేపట్టాలన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.

Somireddy Chandramohan Reddy : సిలికా ద్వారా వైసీపీ నాయకులు  కోట్లు గడిస్తున్నారు

నెల్లూరు : సోమశిల నుంచి 21 టీఎంసీల నీరు దుర్వినియోగం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నీటి దుర్వినియోగంపై మంత్రులు నివేదిక వేసి విచారణ చేపట్టాలన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రూపాయి జీవోతో వైసీపీ నాయకులు చెరువులను ధ్వంసం చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. ధ్వంసమైన చెరువులతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. మట్టిని అమ్ముకొని వైసీపీ నాయకులు వేల కోట్లను సంపాదిస్తున్నారన్నారు.

కోట, చిల్లకూరు సిలికా భారీ కుంభకోణం జరిగిందని సోమిరెడ్డి ఆరోపించారు. రైతులను మోసం చేసి అక్రమ సిలికా ద్వారా వైసీపీ నాయకులు కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. సిలికా మాఫియాలో వాటాలు లోటస్పాండ్ లోని విజయసాయి రెడ్డికి చేరుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములను దక్కించుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో అధికారులు అవకతవకలకు పాల్పడితే కోర్టులకు వెళ్తామని సోమిరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-08-17T13:52:46+05:30 IST