Share News

Anam Venkataramana Reddy: టీడీపీ నేతలపై దాడులు చేస్తే ఊరుకోం

ABN , Publish Date - Dec 19 , 2023 | 04:10 PM

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ( Anam Venkataramana Reddy ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీలో మగాళ్లు లేరని.. టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anam Venkataramana Reddy: టీడీపీ నేతలపై దాడులు చేస్తే ఊరుకోం

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ( Anam Venkataramana Reddy ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీలో మగాళ్లు లేరని.. టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్న సమయంలో హిజ్రాలను పంపడం హేయమైన చర్య అని చెప్పారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తే చూస్తు ఊరుకోమని ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.

Updated Date - Dec 19 , 2023 | 04:10 PM