TDP Deeksha: దీక్షకు దిగిన బాలకృష్ణ సతీమణి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2023-10-02T10:57:49+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

TDP Deeksha: దీక్షకు దిగిన బాలకృష్ణ సతీమణి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు (Chandrababu Arrest) నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అటు ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) దీక్షను ప్రారంభించగా... ఇటు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర (Nandamuri Balakrishna Wife Vasundhara), ఎన్టీఆర్ కుటుంబసభ్యులు (NTR Family) దీక్షలో కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరీ, తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్, చాలసాని చాముండేశ్వరీ, నందమూరి జయశ్రీ, నారా రోహిత్ తల్లి నారా ఇందిరా తదితరులు దీక్షలో కూర్చున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగనుంది.

Updated Date - 2023-10-02T11:26:21+05:30 IST