Ambati Rambabu: బాలకృష్ణ నువ్వు కూర్చోవాల్సింది అక్కడ కాదేమో అంటూ... అంబటి ఫైర్

ABN , First Publish Date - 2023-09-22T10:26:33+05:30 IST

ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతల ఆందోళన కొనసాగుతోంది. సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ambati Rambabu: బాలకృష్ణ నువ్వు కూర్చోవాల్సింది అక్కడ కాదేమో అంటూ... అంబటి ఫైర్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో (AP Assembly) టీడీపీ నేతల ఆందోళన కొనసాగుతోంది. సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బాలకృష్ణ సభలో సీటు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ఆ సీటు చంద్రబాబుది. ఆయనకు అవకాశం వచ్చింది ఆ సీటులో కుర్చో వయ్యా అన్నా కుర్చోవడం లేదు. ప్రోపర్ ఫార్మెట్‌లో వస్తే కూలంకుషంగా చర్చించడానికి సిధ్దం. వారు వాడుతున్న డైలాగులు మా సభ్యులను కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అలా అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెపుతున్నాం. బాలకృష్ణ చంద్రబాబు సీటుపై కాదు చంద్రబాబుపైనే ఎక్కి కుర్చోవాలి అని చెపుతున్నాం. వారికి చర్చల్లో పాల్గోనే దమ్ములేదు... అందుకే వారు చర్చకు రాకుండా బయటకు వెళ్లాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావు. సింగిల్ అంకెతోనే సభలోకి వస్తారు. బాలకృష్ణ కూడా రారు ఆయన ప్లూటు, విజిల్ ఇంటి వద్దే ఊదుకోవాలి’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు యెద్దేవా చేశారు.

Updated Date - 2023-09-22T10:26:33+05:30 IST