Share News

Avanigadda Issue: కర్రలతో వెంటపడుతూ రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే..

ABN , First Publish Date - 2023-10-20T13:33:32+05:30 IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటిని జనసేన, టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో వారిపై కర్ర తీసుకుని వెంటపడ్డారు.

Avanigadda Issue: కర్రలతో వెంటపడుతూ రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే..

కృష్ణా: కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ, జనసేన చేపట్టిన మహాధర్నా హింసాత్మకంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు (YCP MLA Simhadri Ramesh Babu) ఇంటిని జనసేన (Janasena), టీడీపీ (TDP) కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో వారిపై కర్ర తీసుకుని వెంటపడ్డారు. న కార్యకర్తలతో కలిసి టీడీపీ, జనసేనపై బూతులతో రమేష్‌బాబు విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యేకు జనసేన, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు జనసేన కార్యాలయం వరకు కర్రలతో వెళ్లి మరీ దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై మండిపడుతున్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.


కాగా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) అవనిగడ్డ వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.93 కోట్ల వరాలు కురిపించి నేటికీ సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో హామీల అమలు ఎప్పుడు అంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కార్యాలయం ఎదుట మహా ధర్నాకు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే 144 వ సెక్షన్ అమలులో ఉందని ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు ఇప్పటికే మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సహా నియోజకవర్గ తెలుగుదేశం నేతలకు నిన్ననే నోటీసులు జారీ చేశారు. బుద్ధప్రసాద్ సహా పలువురు తెలుగుదేశం, జనసేన నేతలను ఇళ్ళ వద్ద నిర్బంధించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటికి వెళ్ళే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వందల మందితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా మహాధర్నా నిర్వహించి తీరుతామని తెలుగుదేశం, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. సామాన్యుడు నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా పోలీస్ ఆంక్షలు తప్పకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధర్నా అంటూ ఎవరైనా బయటకు వస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు నిన్న అవనిగడ్డ మండలం ఎడ్లంక వద్ద ఇరుపార్టీలు చేపట్టిన జల దీక్ష కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం అధికార పక్షానికి మింగుడు పడని అంశంగా మారింది.

Updated Date - 2023-10-20T13:37:20+05:30 IST