AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. అసెంబ్లీ వాయిదా..
ABN , First Publish Date - 2023-03-20T09:54:33+05:30 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly meetings) ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కాసేపటికే ...
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly meetings) ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కాసేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల(TDP and YCP MLAs) మధ్య ఘర్షణ వాతావరణం తలపించింది. పరస్పరం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై(Balaveeranjaneyaswamy) వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్బాబు(YCP MLA Sudhakar Babu) దాడి చేశారు. దీంతో వెంటనే స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవో నెం. 1 రద్దుకు టీడీపీ సభ్యుల డిమాండ్ చేశారు. పోడియం దగ్గర జీవో నెం.1కి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.