Kollu Ravindra: టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్... ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-02-06T13:09:45+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Kollu Ravindra: టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్... ఉద్రిక్తం

మచిలీపట్నం: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయాని (YCP Party Office)కి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుతగిలారు. వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియా (Media)కు చూపించేందుకు కొల్లురవీంద్ర ప్రయత్నించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మాజీ మంత్రిని అడ్డుకున్నారు. బల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ చర్యలను కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో కొల్లు రవీంద్రను కూడా అరెస్టు చేసి గూడూరువైపు తరలించారు. ఈ ఘటనతో మచిలీపట్నం లక్ష్మీటకీస్ సెంటర్ స్తంభించింది.

Updated Date - 2023-02-06T13:09:46+05:30 IST