Satyakumar: ఖాదీ బండార్ వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-10-03T19:47:16+05:30 IST

గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మ గాంధీ పరితపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar)వ్యాఖ్యానించారు.

Satyakumar: ఖాదీ బండార్ వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం

విజయవాడ: గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మ గాంధీ పరితపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar)వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన ఖాదీ బండారు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘గ్రామాల ఆర్థిక అభివృద్ధి కోసం మోదీ పని చేస్తున్నారు. గ్రామాలల్లో నివాసముంటున్న పేదలకు సొంతింటి కలలను మోదీ నిజం చేశారు. ఖాదీ బండారు వస్త్రాలకు మోదీ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. చేతి వృత్తులవారిని అలాగే కుల వృత్తులవారికి పథకాలు పెడుతున్నారు’’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T19:48:02+05:30 IST