Share News

Perni Nani: కొల్లు రవీంద్ర అబద్ధాలు మాట్లాడుతున్నారు

ABN , First Publish Date - 2023-12-01T19:55:59+05:30 IST

సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Perni Nani: కొల్లు రవీంద్ర అబద్ధాలు మాట్లాడుతున్నారు

కృష్ణాజిల్లా: సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కొల్లు రవీంద్ర సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో, నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా..మదరాసు స్థలంపై ఒక సంస్థకు ఇచ్చే స్థలం ఒక వ్యక్తి పేరు మీద అదికూడా మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు. పోర్ట్ విషయంలో కట్టని పోర్ట్‌కి 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్, కనీసం పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు. పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాలల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్.. మెడికల్ కాలేజీ నా హాయంలో అంటున్నావు ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్, కనీసం ఒక్క జీఓ అయిన ఇచ్చావా అయితే చూపించు. ఈరోజు పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని,జగన్మోహన్ రెడ్డి చలువ కదా. ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగిందని అనుకుంటున్నాము, కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాము. నేను నా కొడుకుని కొత్తగా ప్రమోట్ చేసుకోవడం ఏంటి. గత నాలుగేళ్లుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ నియోజకవర్గానికి పార్టీకి ఇన్‌చార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన అధ్వర్యంలో జరిగింది’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.

Updated Date - 2023-12-01T19:56:00+05:30 IST