Share News

Chandrababu: చంద్రబాబుకి గన్నవరంలో మరోసారి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ABN , First Publish Date - 2023-12-01T17:44:58+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చంద్రబాబు వచ్చారు.

Chandrababu: చంద్రబాబుకి గన్నవరంలో మరోసారి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చంద్రబాబు వచ్చారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేసరపల్లి గూడవల్లి , నిడమానూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడులో చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. రోడ్లు మీదకు వచ్చి చంద్రబాబుకు మహిళలు సంఘీభావం తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ప్రసాదంపాడులో జన ఉత్సాహం ఉప్పొంగిపోయింది. చంద్రబాబును చూసేందుకు మహిళలు, ప్రజలు రోడ్లమీదకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుని మహిళలు, తెలుగు తమ్ముళ్లు పూలతో ముంచెత్తారు. గన్నవరం నుంచి రామవరప్పాడు రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది.

ప్రతి గ్రామంలో చంద్రబాబు మీద స్థానిక గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తున్నారు. గన్నవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. చంద్రబాబును చూసేందుకు భారీగా వాహనాల్లో ప్రజలు తరలి రావడంతో పోలీసులు చేతులు ఎత్తివేశారు. చంద్రబాబు కన్వెని వేగంగా వెళ్లాలని చంద్రబాబు, యార్లగడ్డ వెంకట్రావు వద్దకు స్వయంగా వెళ్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించినప్పటికీ రోడ్లపై పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో వావనాలు ముందుకు వెళ్లళ్లేని పరిస్థితి కనిపించింది.

Updated Date - 2023-12-01T17:52:53+05:30 IST