Lokesh YuvaGalam: ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు..

ABN , First Publish Date - 2023-05-31T16:29:02+05:30 IST

ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

Lokesh YuvaGalam: ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు..

కడప: ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) పాదయాత్రకు (YuvaGalam Padayatra) వైసీపీ (YCP) అడ్డంకులు సృష్టించింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాద్ రెడ్డి (MLA Rachamallu Shivaprasad Reddy) ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు తొలగించారు. రెండు రోజులుగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. ఈరోజు రాత్రికి ప్రొద్దుటూరులోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం అంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని విజయ కుమార్ కూడలి నుంచి రాజీవ్ కూడలి, శివాలయం సర్కిల్ వరకు భారీ ఎత్తున వైసీపీ కటౌట్లు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్లెక్సీల ఏర్పాటుకు చోటు లేకుండా వైసీపీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే లోకేష్ పాదయాత్ర వస్తున్న జనాదరణను చూసి వైసీపీ ఓర్వలేక ఇలాంటి చర్యలకు పూనుకుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీల వివాదం కొనసాగుతోంది.

Updated Date - 2023-05-31T16:29:02+05:30 IST