Jagan and Sharmila: ఈసారి అయినా కలుస్తారనుకుంటే..

ABN , First Publish Date - 2023-09-02T07:45:25+05:30 IST

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి. ఆ సందర్భంగా అన్నాచెల్లెళ్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్ ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లె్ళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది.

Jagan and Sharmila: ఈసారి అయినా కలుస్తారనుకుంటే..

కడప : నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి. ఆ సందర్భంగా అన్నాచెల్లెళ్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్ ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లె్ళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా రిపీటైన సీనే అయినా కూడా ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఉన్నారు. తండ్రి వర్ధంతి నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు షర్మిళ చేరుకున్నారు. ఉదయం షర్మిళ ప్రార్ధనలు ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆమె వెళ్లిపోయిన అనంతరం ఇడుపులపాయకు వచ్చే విధం గా జగన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-09-02T08:23:19+05:30 IST