Viveka Murder Case : ఎంపీ అవినాష్‌కు జూలై-18 టెన్షన్.. సుప్రీంకోర్టులో ఏం తేలుతుందో..!?

ABN , First Publish Date - 2023-07-17T21:50:31+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి..

Viveka Murder Case : ఎంపీ అవినాష్‌కు జూలై-18 టెన్షన్.. సుప్రీంకోర్టులో ఏం తేలుతుందో..!?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. ఈ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP YS Avinash Reddy) బెయిల్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఈ తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు(జూలై-18న) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు అవినాష్ బెయిల్‌పై విచారణ జరుగబోతోంది. అయితే.. అవినాష్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఇంతవరకూ సీబీఐ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోందనే దానిపై అవినాష్‌కు, వైసీపీకి జూలై-18 టెన్షన్ పట్టుకుందట.! రేపు ఏం జరుగుతుందా..? అనేదానిపై వైసీపీ వర్గాల్లో తెగ చర్చించుకుంటున్నారట.


MP-Avinash-Reddy.jpg

ఇది కూడా టెన్షనే..!

ఇదిలా ఉంటే.. అవినాశ్‌రెడ్డికి సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది. ఆగస్టు-14న కోర్టుకు హాజరుకావాలని సమన్లలో (Summons) కోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్‌ రెడ్డిపై (Uday Bhaskar Reddy) సీబీఐ ఛార్జిషీట్ (CBI Chargesheet) వేసింది. గత నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసులో ఒక్కసారిగా సీబీఐ కోర్టు నుంచి పిలుపురావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన్ను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. అయితే.. ఇప్పటి వరకూ సీబీఐ విచారణకు మాత్రమే పిలిచింది.. ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడంతో ఆగస్టు-14న ఏం జరుగుతుందో అని వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైందట.

viveka.jpg

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌కు సమన్లు.. ఏం జరుగుతుందో ఏమో..!?


Updated Date - 2023-07-17T22:02:21+05:30 IST