Share News

TS Elections : తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

ABN , First Publish Date - 2023-11-29T16:33:26+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) పోలింగ్ రేపు ( నవంబర్ 30) వ తేదీన జరగనున్నది. ఈ మేరకు తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ( AP Govt Employees ) కు జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) శుభవార్త తెలిపింది. తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకునే వారికి వేతనంతో కూడిన సెలవును ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది.

TS Elections : తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) పోలింగ్ రేపు ( నవంబర్ 30) వ తేదీన జరగనున్నది. ఈ మేరకు తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ( AP Govt Employees ) కు జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) శుభవార్త తెలిపింది. తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకునే వారికి వేతనంతో కూడిన సెలవును ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ( Mukesh Kumar Meena ) సెలవు మంజూరు చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-11-29T17:05:55+05:30 IST