Share News

MP GVL Narasimha Rao: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి

ABN , First Publish Date - 2023-12-12T20:31:36+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు.

MP GVL Narasimha Rao: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని మంగళవారం నాడు రాజ్యసభలో కోరారు. ప్లాంట్ ఉద్యోగుల, వర్కర్ల పెన్షనర్ల జీతాలు సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ఆపివేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ జీవీఎల్ నరసింహరావు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-12-12T20:31:46+05:30 IST