Kakani Govardhanreddy: చంద్రబాబు - కరువు కవల పిల్లలు

ABN , First Publish Date - 2023-07-10T14:31:33+05:30 IST

ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఒక్క మంచిపని జరిగినా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kakani Govardhanreddy: చంద్రబాబు - కరువు కవల పిల్లలు

పల్నాడు: ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఒక్క మంచిపని జరిగినా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Goverdhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వ్యవసాయ పరిశోధనా కేంద్ర, ల్యాబ్‌లను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చంద్రబాబు (DP Chief Chandrababu naidu) - కరువు కవలపిల్లలని వ్యాఖ్యలు చేశారు. రైతాంగ అవసరాలు తెలియని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వ్యవసాయం దండగ అన్నవ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ మీద పెట్టుబడులు పెడితే ఖర్చు తప్ప రాబడి లేదు అన్న ఏకైక సంస్కరణ కర్త టీడీపీ చీఫ్ అని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచంలో ఏకైక చాంపియన్ అవార్డుకు ఎంపికవ్వడమే ఉదాహరణ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-10T14:31:33+05:30 IST