AP News: అంబటి రాంబాబుపై కోడెల శివరాం ఫైర్

ABN , First Publish Date - 2023-04-12T18:52:00+05:30 IST

నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Shivaram) విమర్శించారు.

AP News: అంబటి రాంబాబుపై కోడెల శివరాం ఫైర్

పల్నాడు: నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Shivaram) విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు‌ (Ambati Rambabu)కు మాటలు తప్ప చేసేది శూన్యమని ఎద్దేవా చేశారు. స్వంత నియోజకవర్గంలో నీరు లేక పంటలు ఎండిపోతున్నా అంబటిలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటికు రైతుల గురించి, వ్యవసాయం గురించి పట్టడం లేదన్నారు. వరి పొట్ట దశలో ఉందని, ఇప్పుడు నీటిని నిలిపివేయడం రైతులకు పెద్ద దెబ్బని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నీరు రాకపోతే రబీ పంటలు అన్ని ఎండిపోతాయని సూచించారు. మూడు రోజులలో సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయకపోతే మంత్రి అంబటి ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-04-12T18:52:04+05:30 IST