Chandrababu: హనుమాయమ్మ హత్యపై విచారణ జరపాలంటూ..!
ABN , First Publish Date - 2023-06-06T18:20:36+05:30 IST
ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో సవలం హనుమాయమ్మ హత్యపై ఏపీ డీజీపీ సహా పలువురికి టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి: ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో సవలం హనుమాయమ్మ హత్యపై ఏపీ డీజీపీ సహా పలువురికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖలు రాశారు. దళిత మహిళ హత్యపై జోక్యం చేసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్కు లేఖలు రాశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం, బడుగువర్గాల హక్కులు హరించబడుతున్న విధానంపై లేఖల్లో వివరించారు. హనుమాయమ్మ హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరారు. హత్య ఘటనలో వైసీపీ నేతలకు పోలీసుల సహకారంపైనా విచారణ జరగాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వడంతో పాటు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.