Achchennaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి పిచ్చి పరాకాష్టకు చేరింది..

ABN , First Publish Date - 2023-03-20T11:02:26+05:30 IST

వైస్సార్‎సీపీ(YCP) ఎమ్మెల్యేలు(MLA) దేవాలయం లాంటి సభలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీడీపీ రాష్ట్ర

Achchennaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి పిచ్చి పరాకాష్టకు చేరింది..

అమరావతి: వైస్సార్‎సీపీ(YCP) ఎమ్మెల్యేలు(MLA) దేవాలయం లాంటి సభలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) ఆవేదన వ్యక్తం చేశారు. సభ వాయిదా అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘డోలా బాలవీరాంజనేయ స్వామిపై(Dola Balaveeranjaneya Swami) సుధాకర్ బాబు(Sudhakar Babu), ఎలీజాలు దాడి చేశారని, వెల్లంపల్లి(Vellampally) మా స్థానాల్లోకి వచ్చి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై(Gorantla Buchaiah Chaudhary) కూడా దాడి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీకి పిచ్చి పరాకాష్టకు చేరింది. స్పీకర్ సైతం మా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారు. ధైర్యం ఉంటే అసెంబ్లీలో జరిగిన ఘటన వీడియో మొత్తాన్ని బయట పెట్టాలి. మాపై దాడి చేసిన వైకాపా ఎమ్మెల్యేలు మాపై అసత్యాలు చెప్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు వీడియో ఉంటే ఎలాంటి చర్యలైనా మాపై తీసుకోండి. కట్ అండ్ పేస్ట్ లేకుండా ఎడిట్ చేయని వీడియో ఫుటేజ్ బయటపెట్టాలి’’ అని అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

Updated Date - 2023-03-20T11:02:26+05:30 IST