Share News

Chinarajappa: లోకేష్ జోలికి వస్తే తాట తీస్తా

ABN , First Publish Date - 2023-12-04T22:23:35+05:30 IST

దోచుకున్న డబ్బుతో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశెఖర్‌రెడ్డి ( Dwarampudi Chandrasekhar Reddy ) మదమెక్కి మాట్లాడుతున్నాడని మాజీ హోం మంత్రి నిమ్మ కాయల చినరాజప్ప ( Nimmakayala Chinarajappa ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ( Nara Lokesh ) పై ఇక మీదట అవాకులు చవాకులు పేలిస్తే తాటతీస్తామని నిమ్మ కాయల చినరాజప్ప హెచ్చరించారు.

Chinarajappa: లోకేష్ జోలికి వస్తే తాట తీస్తా

కాకినాడ: దోచుకున్న డబ్బుతో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశెఖర్‌రెడ్డి ( Dwarampudi Chandrasekhar Reddy ) మదమెక్కి మాట్లాడుతున్నాడని మాజీ హోం మంత్రి నిమ్మ కాయల చినరాజప్ప ( Nimmakayala Chinarajappa ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ( Nara Lokesh ) పై ఇక మీదట అవాకులు చవాకులు పేలిస్తే తాటతీస్తాం. వైసీపీ వైఫల్యాలపై లోకేష్ మాట్లాడితే ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయటం సిగ్గుచేటు. లోకేష్‌ను విమర్శించే స్థాయి ద్వారంపూడికి లేదు. మరో జన్మెత్తినా ద్వారంపూడికి రాదు. నాలుగున్నరేళ్లలో కాకినాడకు ఏం చేశాడో ద్వారంపూడి చెప్పాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేయటం తప్ప ప్రజలకు చేసిందేంటి?. ద్వారంపూడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి... లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’’ అని చినరాజప్ప హెచ్చరించారు.

Updated Date - 2023-12-04T22:23:38+05:30 IST