Share News

Jyotiraditya M. Scindia : రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు పెంచుతాం

ABN , First Publish Date - 2023-12-10T16:09:09+05:30 IST

రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని కేంద్ర పౌర విమానాయన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా ( Jyotiraditya M. Scindia ) తెలిపారు. కోరుకొండ మండలం బూరుగుపల్లిలో ఆదివారం నాడు జరిగిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.

Jyotiraditya M. Scindia : రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు పెంచుతాం

తూర్పుగోదావరి: రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని కేంద్ర పౌర విమానాయన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా ( Jyotiraditya M. Scindia ) తెలిపారు. కోరుకొండ మండలం బూరుగుపల్లిలో ఆదివారం నాడు జరిగిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజమండ్రి రావడం సంతోషంగా ఉంది. రాజమండ్రి ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తాం. ఆధునిక టెక్నాలజీతో రాజమండ్రి ఎయిర్‌ పోర్టు టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. టెర్మినల్ నిర్మాణం సకాలంలో పూర్తిచేసి రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా పేర్కొన్నారు.

Updated Date - 2023-12-10T16:15:44+05:30 IST