Share News

Harirama Jogaiah: నా పేరుతో రాసిన ఆ ఫేక్‌లెటర్‌ని నమ్మొద్దు

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:12 PM

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ( Harirama Jogaiah ) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీల మైత్రి బంధాన్ని చెడగొట్టేందుకు కొందరు నా పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేయిస్తున్నారని హరిరామ జోగయ్య లేఖలో తెలిపారు.

Harirama Jogaiah: నా పేరుతో రాసిన ఆ ఫేక్‌లెటర్‌ని నమ్మొద్దు

పగో: కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ( Harirama Jogaiah ) బహిరంగ లేఖ రాశారు. ఆయన లేఖలో ఏం చెప్పారంటే.... ‘‘రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీల మైత్రీ బంధాన్ని చెడగొట్టేందుకు కొందరు నా పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేయిస్తున్నారు. రానున్న కాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలడంతో వైసీపీ శ్రేణులు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీల శ్రేణులు, ముఖ్యంగా కాపు నేతలు వారి ట్రాప్‌లో పడవద్దని నా విన్నపం. "కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం"అనే శీర్షికతో కొందరు ఆగంతకులు విడుదల చేసిన సదరు లేఖను ఎవ్వరూ నమ్మవద్దు’’ అని హరిరామ జోగయ్య కోరారు.

Updated Date - Dec 24 , 2023 | 11:12 PM