Share News

Atchennaidu: రాజమండ్రికి బయల్దేరిన అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2023-10-31T12:04:51+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Atchennaidu: రాజమండ్రికి బయల్దేరిన అచ్చెన్నాయుడు

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుతో ములాఖల్ అయ్యేందుకు రాజమండ్రికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchennaidu ), టీడీపీ నేతలు ఏలూరి సాంబశివరావు, సత్యప్రసాద్ అమరావతి నుంచి బయల్దేరి వెళ్లారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ప్రతి జిల్లా నుంచి టీడీపీ నేతలు రాజమహేంద్రవరం బయలుదేరుతున్నారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీతో చంద్రబాబు అమరావతి రానున్నారు. రాజమండ్రి నుంచి నేరుగా విజయవాడకు చంద్రబాబు వెళ్తారని టీడీపీ అధిష్ఠానం తెలిపింది.

Updated Date - 2023-10-31T12:04:51+05:30 IST