Lokesh Padayatra: మీ గళాన్ని నేనవుతా... నిరుద్యోగులకు లోకేష్ భరోసా

ABN , First Publish Date - 2023-01-27T14:06:27+05:30 IST

కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర కొనసాగుతోంది.

Lokesh Padayatra: మీ గళాన్ని నేనవుతా... నిరుద్యోగులకు లోకేష్ భరోసా

చిత్తూరు: కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP Leader Lokesh Padayatra) కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేతాజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి లోకేష్ నివాళులర్పించారు. పాదయాత్రలో లోకేష్‌ను నిరుద్యోగ జేఏసీ సభ్యులు కలిశారు. ఎన్నికల ముందు 2.30 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు, డీఎస్సీ, ప్రతి ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు అని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన జగన్ మోసం చేశారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై లోకేష్ స్పందిస్తూ... ‘‘మీ సమస్యలు అన్ని నాకు తెలుసు. అప్పులు చేసి కోచింగ్ తీసుకున్న యువత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి అండగా ఉండటానికే నేను యువ గళం పాదయాత్ర ప్రారంభించాను. మీ గళాన్ని నేనవుతా, యువత ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాడతా’’ నిరుద్యోగులకు టీడీపీ నేత భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-01-27T17:27:31+05:30 IST