TarakaRatna: తారకరత్న ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-01-27T14:38:30+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.

TarakaRatna: తారకరత్న ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కుప్పం

నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌తోపాటు తారకరత్న కుప్పం మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుంచి బయటకు వస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. మాసివ్ స్ట్రోక్‌ రావడంతో కుప్పకూలిపోయారని.. వెంటనే డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.

పాదయాత్రలో ఉన్న సినీహీరో బాలకృష్ణ (Balakrishna) సయితం ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా నిన్నటి నుంచి తారకరత్న.. నారా లోకేష్‌ వెంట ఉండి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న ఇబ్బందికి గురయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం.

Updated Date - 2023-01-27T19:27:32+05:30 IST