Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ

ABN , First Publish Date - 2023-08-14T18:05:04+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో (Haryana Tour) బిజిబిజీగా గడుపుతున్నారు. తన సతీమణి భువనేశ్వరితో (Nara Bhuvaneswari) కలిసి బాబు హిమాచల్ ‌టూర్‌కు వెళ్లారు..

Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో (Haryana Tour) బిజిబిజీగా గడుపుతున్నారు. తన సతీమణి భువనేశ్వరితో (Nara Bhuvaneswari) కలిసి బాబు హిమాచల్ ‌టూర్‌కు వెళ్లారు. పర్యటన ముగించుకొని తిరిగొస్తూ తెలుగు వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను (Bandaru Dattatraya) హర్యానా రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బాబు దంపతులకు గవర్నర్, ఆయన సతీమణి బండారు వసంత (Bandaru Vasantha) రాజ్‌భవన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువేశ్వరికి శాలువా కప్పి, కృష్ణుడి విగ్రహాన్ని గవర్నర్ దంపతులు అందజేశారు. సుమారు అరగంటకు పైగా బాబు-దత్తన్న చర్చించుకున్నారు. గవర్నర్ ఆరోగ్యంపై బాబు ఆరాతీశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు తెలియవచ్చింది. ఈ భేటీకి సంబంధించి హర్యానా రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.


WhatsApp Image 2023-08-14 at 5.44.33 PM.jpeg

Updated Date - 2023-08-14T18:08:11+05:30 IST