CBI Reject: విచారణకు రాలేనని అవినాశ్ లేఖ.. సీబీఐ సమాధానం ఇది.!

ABN , First Publish Date - 2023-05-16T13:13:37+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణకు నాలుగు రోజుల సమయం కోరుతూ కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి రాసిన లేఖను సీబీఐ రిజెక్ట్ చేసింది.

CBI Reject: విచారణకు రాలేనని అవినాశ్ లేఖ.. సీబీఐ సమాధానం ఇది.!

హైదరాబాద్/అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో (YS Viveka Case) సీబీఐ విచారణకు (CBI Investigation) నాలుగు రోజుల సమయం కోరుతూ కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (Kadapa MP Avinash Reddy) రాసిన లేఖను సీబీఐ రిజెక్ట్ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ సీబీఐ అధికారులు (CBI Officers) ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అవినాశ్ రెడ్డి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఉన్నారు. సీబీఐ నుంచి సమాచారం తరువాత పులివెందుల వెళ్లాలని నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తారని చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే అవినాష్ అభ్యర్ధనను సీబీఐ తిరస్కరించిన నేపథ్యంలో ఎంపీ విచారణపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది.

cbi-notice.jpg

వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఈరోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తాను సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ మేరకు సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నాని, నాలుగు రోజులు గడువు కావాలంటూ ఎంపీ అవినాశ్ మెయిల్ ద్వారా సీబీఐకి లేఖ పంపించారు. అయితే ఎంపీ విజ్ఞప్తిని సీబీఐ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో అవినాశ్ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-05-16T13:50:27+05:30 IST