CBN: అంగళ్లు అల్లర్ల కేసులో 54 మంది టీడీపీ శ్రేణులకు ఊరట..
ABN , First Publish Date - 2023-09-24T14:31:35+05:30 IST
అంగళ్లు అల్లర్ల కేసులో అరెస్టైన టీడీపీ శ్రేణులకు భారీ ఊరట లభించింది. వారందరికి ఆదివారం బెయిల్ మంజూరయింది.
చిత్తూరు: అంగళ్లు అల్లర్ల కేసులో అరెస్టైన టీడీపీ(TDP) శ్రేణులకు భారీ ఊరట లభించింది. వారందరికి ఆదివారం బెయిల్(Bail) మంజూరయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు(Angallu)లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.
టీడీపీ శ్రేణులు బాబును రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు జరిగాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో చంద్రబాబుని ఏ1గా చేర్చారు. అయితే ఘటనకు కారణంగా పేర్కొంటూ తెలుగు దేశం పార్టీకి చెందిన చెందిన 54 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప సెంట్రల్ జైలులో వాళ్లను రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. దాదాపు 3 నెలలపాటు వీరు రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుతో బెయిల్ పై విడుదలైన వారికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగా రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ మాధవి రెడ్డి తదితర నేతలు స్వీట్లు తినిపించి స్వాగతం పలికారు.