AP News: రసాభాసగా మారిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
ABN , First Publish Date - 2023-02-01T20:55:29+05:30 IST
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్క్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ (YCP), ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్క్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ (YCP), ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పొడియం దగ్గర టీడీపీ (TDP), జనసేన (Janasena), వామపక్షాలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్లు తనపట్ల అమానుషంగా ప్రవర్తించారని జనసేన ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి ఆరోపించారు. మేయర్ పొడియం దగ్గర తనను గెంటేసి, కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ కావాలని డిమాండ్ చేశారు. తనను కొట్టినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వసంతలక్ష్మి తెలిపారు.