AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

ABN , First Publish Date - 2023-08-24T19:28:20+05:30 IST

మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తాకింది. జీడిపల్లి - కుందుర్పి ఎత్తిపోతల పథకం(Jeedipally - Kundurpi lift scheme) భూ నిర్వాసితులకు పరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

అనంతపురం: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తాకింది. జీడిపల్లి - కుందుర్పి ఎత్తిపోతల పథకం(Jeedipally - Kundurpi lift scheme) భూ నిర్వాసితులకు పరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) హామీ ఇచ్చిన పరిహారం అందించలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుందుర్పి మండలంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటిస్తున్న సమయంలో మంత్రిని‌ చుట్టుముట్టి నిరసన తెలిపారు. కాన్వాయ్‌ను అప్పుల పల్లి గ్రామం వద్ద రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా వాహనంలోనే మంత్రి ఉష శ్రీ చరణ్ కూర్చోడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి బందోబస్తుగా వచ్చిన పోలీసులు రైతులను అడ్డకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2023-08-24T19:28:20+05:30 IST