Raghuveerareddy: బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-29T16:15:22+05:30 IST

బీజేపీ ఒత్తిడితోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Raghuveerareddy: బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్ట్

శ్రీసత్యసాయి జిల్లా: బీజేపీ ఒత్తిడితోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు (TDP Chief Chandrababu Arrest) జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి (Congress Leader Raghuveera Reddy) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం (Jagan Government) భుజంపై బీజేపీ (BJP) తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని ఆరోపించారు. టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టిన ప్రయోజనం శూన్యమన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని... కాబట్టి టీడీపీ (TDP) కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. బీజేపీ, ప్రధాని మోదీ (PM Narendra Modi), అమిత్ షాలకు (Union Minister Amit Shah) తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని అన్నారు. వీటన్నింటికీ మూల కారణం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాలన్నది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏదో ఒకరోజు జగన్‌కు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండదని రఘువీరారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-09-29T16:16:49+05:30 IST