Vijayashanti: నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి... కవితపై రాములమ్మ ఫైర్

ABN , First Publish Date - 2022-11-19T13:51:11+05:30 IST

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి... కవితపై రాములమ్మ ఫైర్

హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని ఆ పార్టీ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. శనివారం ధర్మపురి నివాసానికి వెళ్లి... దాడి జరిగిన పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాములమ్మ మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ (KCR) బుద్ది వంకర బుద్ది అని మండిపడ్డారు. కేసీఆర్ (Telangana CM) తన బిడ్డలకైనా మంచి బుద్ది ఇచ్చి ఉంటే బాగుండు అని యెద్దేవా చేశారు. కవిత (Kavita) వీధీరౌడీల్లాగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు ఏ భాష వాడారో, బీజేపీ అదే భాష మాట్లాడుతుంది’’ అని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు చూస్తూ సహించమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి కానీ దాడులు ఏంటి అని విజయశాంతి (BJP Leader) ప్రశ్నించారు.

Updated Date - 2022-11-19T13:51:12+05:30 IST