తండ్రి మరణానికి ప్రతీకారంగా యువకుడిని ప్రేమించిన కుమార్తె.. ప్రియుడితో కలిసి మరో యువతికి తన దుస్తులు వేసి మరీ..

ABN , First Publish Date - 2022-12-01T16:12:25+05:30 IST

ప్రస్తుతం యువకులతో పాటూ యువతుల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ప్రేమ, వివాహేతర సంబంధాల విషయాల్లో కొందరు నేరాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు..

తండ్రి మరణానికి ప్రతీకారంగా యువకుడిని ప్రేమించిన కుమార్తె.. ప్రియుడితో కలిసి మరో యువతికి తన దుస్తులు వేసి మరీ..

ప్రస్తుతం యువకులతో పాటూ యువతుల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ప్రేమ, వివాహేతర సంబంధాల విషయాల్లో కొందరు నేరాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు పాత కక్షలకు ప్రతీకారంగా దారుణాలకు తెగబడుతున్నారు. ఢిల్లీలో ఓ యువతి చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. తండ్రి మరణానికి ప్రతీకారంగా యువకుడిని ప్రేమించిన యువతి.. చివరకు దారుణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే..

ఏటీఎం మిషన్‌కి జిగురు పూసి మరీ.. వీళ్లు చేసిన చోరీ తెలిస్తే.. అవాక్కవుతారు..

ఢిల్లీ (Delhi) సమీపంలోని నోయిడా పరిధి బిస్రఖ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న పాయల్ అనే యువతి తండ్రి ఇటీవల హత్యకు గురయ్యాడు. అయితే తండ్రి మరణానికి హేమలత అనే యువతి కారణమని తెలుసుకుని.. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా (Social media) ద్వారా అజయ్ అనే యువకుడిని పరిచయం చేసుకుంది. అతడితో రోజూ చాటింగ్ చేసేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమాయణం (love) నడిచింది. పాయల్ కోసం అజయ్ ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. దీంతో ఇటీవల ఆమె హేమలతను హత్య చేయాలనే విషయాన్ని ప్రియుడికి తెలియజేసింది.

మూడేళ్ల కూతురు అదృశ్యం.. పొలాల్లో దొరికిన మృతదేహం.. అత్యాచారం చేసి చంపేసినా రెండేళ్లుగా కదలని కేసు..!

ఇద్దరూ కలిసి ఆమెను నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం ఆమె మొఖంపై యాసిడ్ పోసి, గుర్తుపట్టని విధంగా చేశారు. తర్వాత కేసు తమ మీదకు రాకుండా ఉండేందుకు పాయల్.. తన దుస్తులను మృతదేహానికి వేసింది. తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయింది. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పాయల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు.. కాలితో నోరును నొక్కి.. కర్రలతో చితకబాది..

దుస్తులు తమ కూతురివే కావడంతో అంతా పాయల్ చనిపోయిందని అనుకున్నారు. అనంతరం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో హేమలత తల్లిదండ్రులు కూడా తమ కూతురు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహం దొరికిన రోజే హేమలత కూడా కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చి లోతుగా విచారించారు. చివరకు పాయల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసి.. పాయల్, అజయ్ సహా నలుగురిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

అన్న పెళ్లి కోసం చెల్లెలి త్యాగం.. ఎందుకిలా చేశావ్ అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం..

Updated Date - 2022-12-01T17:39:42+05:30 IST