భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..

ABN , First Publish Date - 2022-12-07T20:53:57+05:30 IST

ఆమెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. కానీ వివాహమై, పిల్లలు ఉన్న బంధువుతో ప్రేమలో పడింది. భర్త, పిల్లలను వదిలిపెట్టి ప్రియుడితో పాటూ వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ..

భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..

ఆమెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. కానీ వివాహమై, పిల్లలు ఉన్న బంధువుతో ప్రేమలో పడింది. భర్త, పిల్లలను వదిలిపెట్టి ప్రియుడితో పాటూ వెళ్లిపోయింది. కొన్నాళ్లకు తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే ఆమె చెప్పిన మాటలకు అంతా షాక్ అయ్యారు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక.. మరుక్షణం కంటైనర్‌లో.. ఇంటికి వచ్చాక ఆమె చెప్పింది విని..

ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) గోరెలా-పెండ్రా-మార్వాహి జిల్లా పరిధి మార్వాహి ప్రాంతానికి చెందిన జీవన్ లాల్ అనే వ్యక్తి.. భార్య ఫూల్‌కున్వర్, నలుగురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవన్ లాల్‌కు సమీప బంధువైన రాజేంద్ర ప్రసాద్ భార్య రాఖీ పూరీతో వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. ఇద్దరూ కలిసి కుటుంబ సభ్యులకు తెలీకుండా కలుసుకునేవారు. అయితే ఇటీవల ఒక్కసారిగా ఇద్దరూ అదృశ్యమయ్యారు. కొన్నాళ్ల అనంతరం మళ్లీ ఇద్దరూ సొంత గ్రామానికి తిరిగొచ్చారు.

పెళ్లి చూపుల్లో యువతి నంబర్ తీసుకున్న యువకుడు.. ఓ రోజు ఫోన్ చేసి ఊరి బయటికి రమ్మని చెప్పి..

ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ప్రియుడు జీవన్ లాల్ లేకుండా తాను ఉండలేనని రాఖీ పారీ తెలిపింది. భార్య లేకుండా తానూ ఉండలేనంటూ రాజేంద్ర ప్రసాద్ కూడా తన నిర్ణయాన్ని తెలియజేశాడు. ఈ క్రమంలో జీవన్ లాల్, రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవ (quarrels) తలెత్తింది. చివరకు ఇరు వర్గాలు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాఖీ పూరీని ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించారు. ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఓ మహిళ గొంతులోంచి డాక్టర్లు బయటకు తీసిన ఈ వింత పదార్థమేంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

Updated Date - 2022-12-07T21:07:04+05:30 IST