పెళ్లి చూపుల్లో యువతి నంబర్ తీసుకున్న యువకుడు.. ఓ రోజు ఫోన్ చేసి ఊరి బయటికి రమ్మని చెప్పి..

ABN , First Publish Date - 2022-12-07T16:12:48+05:30 IST

పెళ్లి చూపుల్లో యువతిని చూసిన ఓ యువకుడు తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె నంబర్ తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే..

పెళ్లి చూపుల్లో యువతి నంబర్ తీసుకున్న యువకుడు.. ఓ రోజు ఫోన్ చేసి ఊరి బయటికి రమ్మని చెప్పి..
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి చూపుల్లో యువతిని చూసిన ఓ యువకుడు తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె నంబర్ తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే యువతి కుటుంబ సభ్యులకు మాత్రం ఈ సంబంధం నచ్చలేదు. అయినా యువకుడు మాత్రం ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. ఓ రోజు ఫోన్ చేసి, ఊరి బయటకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన ఆమెపై చివరకు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ప్రేమికులను గదిలో బంధించిన యువకులు.. యువతి నాలుకను నేలకు తాకించి మరీ..

గుజరాత్ (Gujarat) అహ్మదాబాద్ పరిధి జగదాంబ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన భవానీ సింగ్ అనే యువకుడు పెళ్లి ప్రయత్నాలు చేసేవాడు. ఈ క్రమంలో పెళ్లి చూపుల నిమిత్తం మూడేళ్ల క్రితం రాజస్థాన్ (Rajasthan) పాలి జిల్లా శివపురా ప్రాంతానికి వెళ్లాడు. అయితే యువతి (young woman) కుటుంబ సభ్యులకు భవానీ సింగ్ నచ్చకపోవడంతో వద్దనుకున్నారు. అయితే భవానీ సింగ్ మాత్రం ఎలాగైనా సదరు యువతినే వివాహం (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఆమె నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఇలా కొన్నాళ్లు ఆమెతో మాట్లాడిన తర్వాత.. 2020లో వారి గ్రామానికి వెళ్లాడు. ఊరి బయట నుంచి యువతికి ఫోన్ చేశాడు. అర్జంట్‌గా మాట్లాడాలని చెప్పడంతో యువతి అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది.

మీ భర్త వేరే మహిళతో తిరుగుతున్నాడని.. ఫోన్ చేసిన వ్యక్తి.. తీరా అక్కడికి వెళ్లగా.. స్కూటీలో వచ్చిన యువతి సడన్‌గా..

ఆమెతో మాట్లాడే క్రమంలో ప్రసాదం ఇచ్చాడు. అది తిన్న కాసేపటికి యువతి అపస్మారక స్థితికి (unconsciousness) చేరుకుంది. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి స్పృహలోకి రాగానే జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయింది. ఇలావుండగా, కొన్ని నెలల తర్వాత మళ్లీ ఆమెకు ఫోన్ చేశాడు. అయితే భవానీ సింగ్‌ను కలిసేందుకు ఆమె నిరాకరించింది. దీంతో గతంలో అత్యాచారం చేసిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు.. యువతికి పంపాడు. తాను చెప్పిన చోటికి రాకుంటే అవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన యువతి.. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది.

వివాహితకు ఫోన్‌లో పరిచయమైన యువకుడు.. ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించకపోవడంతో.. ఆస్పత్రికి ఫోన్ చేసి..

వెళ్లగానే ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి, అహ్మదాబాద్ తీసుకెళ్లాడు. ఆ సమయంలో భవానీ సింగ్‌తో పాటూ అతడి తండ్రి సురేష్ సింగ్, మరో బంధువు ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఆర్యసమాజ్‌లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే మరోవైపు కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు (Police Complaint) చేశారు. 2020 నుంచి యువతిని బంధించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. 2022 డిసెంబర్ 5న అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మామ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి.. పొద్దున లేచిన కూతుళ్లు షాక్..

Updated Date - 2022-12-07T16:12:52+05:30 IST